మదీనాకు చేరుకున్న 344,000 మంది హజ్ యాత్రికులు

- July 02, 2022 , by Maagulf
మదీనాకు చేరుకున్న 344,000 మంది హజ్ యాత్రికులు

మదీనా: ఈ సంవత్సరం హజ్ చేయడానికి అనేక దేశాల నుండి మొత్తం 344,881 మంది యాత్రికులు మదీనాకు చేరుకున్నారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ జారీ యాత్రికుల వివరాలను వెల్లడించింది. మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇప్పటివరకు 278,751 మంది యాత్రికులు చేరుకున్నారని, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా 49,806 మంది యాత్రికులు వచ్చినట్లు పేర్కొంది. మదీనాలో ఉంటున్న యాత్రికుల జాతీయతలను కూడా వెల్లడించారు. బంగ్లాదేశ్ యాత్రికులు మదీనాలో 12,411 మందితో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థానీయులు 8,229, భారతీయులు 6,595, ఇరానియన్లు 6,433, మరియు నైజీరియన్లు 6,320 మంది ఉన్నారు. మక్కాలోని పవిత్ర స్థలాలకు వెళ్లే మార్గంలో గత కొన్ని రోజులుగా 265,130 మంది యాత్రికులు మదీనా నుండి బయలుదేరి వెళ్లగా.. 79,451 మంది యాత్రికులు మదీనాలో ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com