మదీనాకు చేరుకున్న 344,000 మంది హజ్ యాత్రికులు
- July 02, 2022
మదీనా: ఈ సంవత్సరం హజ్ చేయడానికి అనేక దేశాల నుండి మొత్తం 344,881 మంది యాత్రికులు మదీనాకు చేరుకున్నారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ జారీ యాత్రికుల వివరాలను వెల్లడించింది. మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇప్పటివరకు 278,751 మంది యాత్రికులు చేరుకున్నారని, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా 49,806 మంది యాత్రికులు వచ్చినట్లు పేర్కొంది. మదీనాలో ఉంటున్న యాత్రికుల జాతీయతలను కూడా వెల్లడించారు. బంగ్లాదేశ్ యాత్రికులు మదీనాలో 12,411 మందితో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థానీయులు 8,229, భారతీయులు 6,595, ఇరానియన్లు 6,433, మరియు నైజీరియన్లు 6,320 మంది ఉన్నారు. మక్కాలోని పవిత్ర స్థలాలకు వెళ్లే మార్గంలో గత కొన్ని రోజులుగా 265,130 మంది యాత్రికులు మదీనా నుండి బయలుదేరి వెళ్లగా.. 79,451 మంది యాత్రికులు మదీనాలో ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







