మదీనాకు చేరుకున్న 344,000 మంది హజ్ యాత్రికులు
- July 02, 2022
మదీనా: ఈ సంవత్సరం హజ్ చేయడానికి అనేక దేశాల నుండి మొత్తం 344,881 మంది యాత్రికులు మదీనాకు చేరుకున్నారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ జారీ యాత్రికుల వివరాలను వెల్లడించింది. మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇప్పటివరకు 278,751 మంది యాత్రికులు చేరుకున్నారని, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా 49,806 మంది యాత్రికులు వచ్చినట్లు పేర్కొంది. మదీనాలో ఉంటున్న యాత్రికుల జాతీయతలను కూడా వెల్లడించారు. బంగ్లాదేశ్ యాత్రికులు మదీనాలో 12,411 మందితో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థానీయులు 8,229, భారతీయులు 6,595, ఇరానియన్లు 6,433, మరియు నైజీరియన్లు 6,320 మంది ఉన్నారు. మక్కాలోని పవిత్ర స్థలాలకు వెళ్లే మార్గంలో గత కొన్ని రోజులుగా 265,130 మంది యాత్రికులు మదీనా నుండి బయలుదేరి వెళ్లగా.. 79,451 మంది యాత్రికులు మదీనాలో ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!







