మదీనాకు చేరుకున్న 344,000 మంది హజ్ యాత్రికులు
- July 02, 2022
మదీనా: ఈ సంవత్సరం హజ్ చేయడానికి అనేక దేశాల నుండి మొత్తం 344,881 మంది యాత్రికులు మదీనాకు చేరుకున్నారు. హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ జారీ యాత్రికుల వివరాలను వెల్లడించింది. మదీనాలోని ప్రిన్స్ మహ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ఇప్పటివరకు 278,751 మంది యాత్రికులు చేరుకున్నారని, ల్యాండ్ ఇమ్మిగ్రేషన్ ద్వారా 49,806 మంది యాత్రికులు వచ్చినట్లు పేర్కొంది. మదీనాలో ఉంటున్న యాత్రికుల జాతీయతలను కూడా వెల్లడించారు. బంగ్లాదేశ్ యాత్రికులు మదీనాలో 12,411 మందితో అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థానీయులు 8,229, భారతీయులు 6,595, ఇరానియన్లు 6,433, మరియు నైజీరియన్లు 6,320 మంది ఉన్నారు. మక్కాలోని పవిత్ర స్థలాలకు వెళ్లే మార్గంలో గత కొన్ని రోజులుగా 265,130 మంది యాత్రికులు మదీనా నుండి బయలుదేరి వెళ్లగా.. 79,451 మంది యాత్రికులు మదీనాలో ఉన్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









