వేసవిలో ఫుడ్ డెలివరీ.. మోటార్సైకిళ్లకు బదులుగా కార్లు
- July 02, 2022
దోహా: ఖతార్లోని ఫుడ్ డెలివరీ సర్వీస్ కంపెనీలు వేసవి కాలంలో మోటార్సైకిళ్లకు బదులుగా కారు ద్వారా వినియోగదారులకు ఆర్డర్లను డెలివరీ చేయడం ప్రారంభించాయి. దేశంలో వేసవి నెలల్లో డెలివరీ రైడర్లు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3:30 గంటల వరకు కార్లను మాత్రమే ఉపయోగించుకునేలా నిబంధన విధించారు. ఇది జూలై 1 నుండి అమలులోకి వచ్చింది. సెప్టెంబర్ 15, 2022 వరకు అమల్లో ఉంటుంది. ఖతార్లోని అనేక ఫుడ్ డెలివరీ కంపెనీలు సోషల్ మీడియాలో ఈ చర్యను స్వాగతించాయి. జూన్ 1 నుండి సెప్టెంబరు 15 వరకు బహిరంగ ప్రదేశాల్లో చట్టబద్ధమైన పని గంటలను పొడిగించిన 2021 నాటి మినిస్టీరియల్ డిక్రీ నెం. 17కు అనుగుణంగా తాజా చర్యలను తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







