ఎమెర్జెన్సీ లైట్లను వాడటం పై హెచ్చరించిన దుబాయ్ పోలీసులు
- July 02, 2022
దుబాయ్: ఎమెర్జెన్సీ లైట్లను వాడటం పై నగర పౌరులను మరియు వాహన చోదకులను దుబాయ్ ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. పోలిస్ ఎమెర్జెన్సీ లైట్లను పెట్టుకొని రెండు కార్లు రోడ్ల మీద నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఈ హెచ్చరిక జారీ చేయడం జరిగింది.
ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధిపతిగా వ్యవహరిస్తున్న కల్నల్ జుమా బిన్ సువైదాన్ మాట్లాడుతూ పౌరుల భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో వాహన చోదకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలుపుతూనే ఈ చర్యలు చేపట్టకుండా ఉండాలంటే ట్రాఫిక్ చట్టాలను అతిక్రమణ చేయకూడదని పేర్కొన్నారు.
ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించి అనుమతి లేకుండా ఎమెర్జెన్సీ లైట్లను పెట్టుకొని రోడ్ల పై నిర్లక్ష్యంగా నడిపిన ఆ రెండు కార్లు యాజమానుల పై చర్యల గురించి మాట్లాడుతూ ఆ రెండు కార్లలో ఒకటి ఏమిరెట్స్ రోడ్డులో ,మరొకటి షేక్ మొహమ్మద్ బిన్ జయేద్ రోడ్డు లో మా సిబ్బంది గమనించారు. వారి మీద శాఖాపరంగా కఠినమైన చర్యలు తీసుకోబోతున్నామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్ప్రింగ్ బ్రేక్ తర్వాత మరో రెండు వారాలు ఆన్లైన్ క్లాసులు..
- వాటర్ ట్యాంకర్ల ధరలు పెంపు..నోటీసులు జారీ..!!
- కోరమాండల్ కాకినాడ ప్లాంట్కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు
- ఇఫ్తార్ విందులో సీఎం చంద్రబాబు...
- Oscars 2026 winners : ఆస్కార్ అవార్డ్స్ 2026, విజేతల పూర్తి వివరాలు
- ఐపీఎల్ 2026: 10 జట్ల కెప్టెన్ల వివరాలు ఇవే!
- సినీ నటి ప్రత్యూష ఆత్మహత్య కేసు..కోర్టులో లొంగిపోయిన సిద్ధార్ధ రెడ్డి
- అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం..
- ఫుజైరా పెట్రోలియం కేంద్రం పై డ్రోన్ దాడి: అదుపులో మంటలు..
- జెడ్డా ఎఫ్1 గ్రాండ్ ప్రిక్స్ వాయిదా..!!









