అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్

- July 04, 2022 , by Maagulf
అక్రమంగా తరలిస్తున్న బంగారం సీజ్

దుబాయ్ నుంచి భారత దేశానికి 300 గ్రాముల బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని చెన్నై విమానాశ్రయం లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అంతేకాకుండా బంగారాన్ని స్వాధీనం చేసుకుని జప్తు చేసి కేసు నమోదు చేశారు. 

జప్తు చేయబడిన బంగారం ధర సుమారు 10,000 డాలర్లు (భారత కరెన్సీ విలువ ప్రకారం రూ.7,90,000). బంగారం మాత్రమే కాకుండా అతని దగ్గర 18,000 డాలర్లు విలువ చేసే ఎలక్ట్రానిక్స్, సిగేరెట్స్ మరియు మద్యం బాటిళ్లు ఉన్నాయి. 

ఈ వారం ప్రారంభంలోనే సౌదీ అరేబియా నుండి ఢిల్లీ కి వచ్చిన ప్యాసింజర్ దగ్గర 28,000 డాలర్లు ఖరీదు చేసే 500 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. భారత దేశానికి సదరు వ్యక్తి దగ్గర బంగారాన్ని కడ్డీల రూపంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com