ఈద్ అల్ అధా 2022.. కోవిడ్ భద్రతా నియమాలు
- July 05, 2022
యూఏఈ: ఈ వారాంతంలో ఈద్ అల్ అదా సందర్భంగా నివాసితులు తప్పనిసరిగా పాటించాల్సిన కోవిడ్ భద్రతా నియమాలను నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) ప్రకటించింది. బలి మాంసం, బహుమతులు, ఆహారాన్ని పొరుగువారి మధ్య పంపిణీ చేయడానికి అనుమతించబడుతుందని పేర్కొన్నారు. అయినప్పటికీ పంపిణీకి ముందు వాటిని శుభ్రమైన, క్రిమిరహితం చేసిన బ్యాగ్లు లేదా పెట్టెల్లో ఉంచాలని స్పష్టం చేసింది. కమ్యూనిటీ ఆరోగ్యం, భద్రతను నిర్ధారించడానికి నివాసితులు ఈద్ 72 గంటలలోపు PCR పరీక్ష చేయించుకోవాలని సూచించారు. జంతువులను వధించడానికి లైసెన్స్ లేని కార్మికులను వినియోగించవద్దని కోరింది. పిల్లలకు ఇచ్చిన ఈద్ డబ్బును బదిలీ చేయడానికి యాప్లు లేదా వెబ్సైట్లను ఉపయోగించమని నివాసితులకు సూచించింది. తమ కుటుంబాల్లోనే వేడుకలను పరిమితం చేసుకోవాలని పౌరులు/నివాసితులకు సూచించారు. కుటుంబ సందర్శనల సమయంలో మాస్కులు ధరించాలని, ఇతరుల నుండి సురక్షితమైన సామాజిక దూరాన్ని పాటించాలని కోరింది. ముఖ్యంగా వృద్ధులు లేదా దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







