ముగ్గురు బాలికలను వేధించిన థెరపిస్ట్.. నిర్దోషిగా ప్రకటించిన బహ్రెయిన్ కోర్టు
- July 05, 2022
బహ్రెయిన్: స్నేహితులుగా ఉన్న ముగ్గురు బాలికలను వేధించిన కేసులో ఫిజియోథెరపిస్ట్ను హై క్రిమినల్ కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.లైంగిక వేధింపుల ఘటన జరిగిన సమయంలో వారు ఫిజియోథెరపిస్ట్ క్లినిక్లో రోగులుగా ఉన్నందున వారి ఆరోపణలు నమ్మశక్యం కానిదిగా కోర్టు భావించింది.కోర్టు ఫైల్స్ ప్రకారం..ఫిజియోథెరపిస్ట్ క్లినిక్ ప్రారంభించేందుకు బహ్రెయిన్ వచ్చారు.ముగ్గురూ అతని పర్యవేక్షణలో శిక్షణ పొందారు.కానీ చివరకి ఫిజియోథెరపిస్ట్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.ఆరోపణలు చేసిన ముగ్గురు బాలికలు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం కేసు నమోదు చేశారన ప్రతివాది న్యాయవాది వాదించారు. ఆరోపణలు చేసిన వారిలో ఒకరు తన స్వంత క్లినిక్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు.దీంతోపాటు క్లినిక్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా కోర్టు వీక్షించగా.. పరిస్థితి పూర్తిగా సాధారణమేనని, ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తేలింది.ఇవన్నీ పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై అభియోగాలను కొట్టివేసింది.
తాజా వార్తలు
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!







