ముగ్గురు బాలికలను వేధించిన థెరపిస్ట్.. నిర్దోషిగా ప్రకటించిన బహ్రెయిన్ కోర్టు
- July 05, 2022
బహ్రెయిన్: స్నేహితులుగా ఉన్న ముగ్గురు బాలికలను వేధించిన కేసులో ఫిజియోథెరపిస్ట్ను హై క్రిమినల్ కోర్ట్ నిర్దోషిగా ప్రకటించింది.లైంగిక వేధింపుల ఘటన జరిగిన సమయంలో వారు ఫిజియోథెరపిస్ట్ క్లినిక్లో రోగులుగా ఉన్నందున వారి ఆరోపణలు నమ్మశక్యం కానిదిగా కోర్టు భావించింది.కోర్టు ఫైల్స్ ప్రకారం..ఫిజియోథెరపిస్ట్ క్లినిక్ ప్రారంభించేందుకు బహ్రెయిన్ వచ్చారు.ముగ్గురూ అతని పర్యవేక్షణలో శిక్షణ పొందారు.కానీ చివరకి ఫిజియోథెరపిస్ట్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు.ఆరోపణలు చేసిన ముగ్గురు బాలికలు ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం కేసు నమోదు చేశారన ప్రతివాది న్యాయవాది వాదించారు. ఆరోపణలు చేసిన వారిలో ఒకరు తన స్వంత క్లినిక్ని ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కోర్టుకు తెలిపారు.దీంతోపాటు క్లినిక్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని కూడా కోర్టు వీక్షించగా.. పరిస్థితి పూర్తిగా సాధారణమేనని, ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని తేలింది.ఇవన్నీ పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిపై అభియోగాలను కొట్టివేసింది.
తాజా వార్తలు
- వాట్సాప్లోనే ఈ-ఆధార్ డౌన్లోడ్.. కొత్త సర్వీస్!
- హర్మూజ్ జలసంధిని తెరవాలని ఇరాన్కు 20 దేశాల విజ్ఞప్తి
- ఫ్యామిలీ డెంటల్ ప్యాకేజీలు ప్రారంభించిన మెడికవర్ హాస్పిటల్స్
- యూఏఈలో అస్థిర వాతావరణం..అబుదాబి, దుబాయ్లలో వర్షాలు..!!
- ఆసుపత్రులను తనిఖీ చేసిన హెల్త్ మినిస్టర్..!!
- ఇరాన్ దాడులు..బహ్రెయిన్ వ్యాప్తంగా సంఘీభావం వ్యక్తం..!!
- సౌదీ అరేబియాలో స్ప్రింగ్ సీజన్ ప్రారంభం..!!
- కన్షుమర్ స్పెండింగ్ పాటర్న్ ని హైలెట్ చేసిన ఈద్..!!
- మాతృ దినోత్సవం..శుభాకాంక్షలు తెలిపిన ఒమన్ మహారాణి..!!
- ఇన్విజిలేటర్ల ఫోన్లపై నిషేధం..పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ట్రాకింగ్









