నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన దుబాయ్ తెలుగు అసోసియేషన్
- July 05, 2022
యూఏఈ: యూఏఈలోని ఫుజైరాలో ఒక క్వారి సంస్ధలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారితో సహా 20 మంది భారతీయులు చాలా కాలంగా పని చేస్తున్నారు.కానీ గత సంవత్సరం నుండి వీరికి సంస్ధ వేతనాలు చెల్లించడం లేదు.స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనుకొన్న వారికి గ్రాట్యూటి, బకాయి వేతనాలు కూడా ఇవ్వడం లేదు.ఒక వైపు రావల్సిన బకాయిలు రాలేక, జీతం లేక తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నారు.
వీరి దయనీయ స్ధితి గురించి భారతీయ కాన్సులేట్ ద్వారా దుబాయ్ లోని తెలుగు అసోసియెషన్ తెలుసుకుని అండగా నిలిచింది.అసోసియేషన్కు చెందిన సాయి ప్రకాశ్,సాయికృష్ణా, చైతన్య, భీంశంకర్, ఫహీం,విజయభాస్కర్లు ఈ మెరకు ఫుజైరాకు వెళ్ళి ఆకలితో అలమటిస్తున్న కార్మికులకు నెలరోజులకు సరిపడా ఆహార సామాగ్రి,ఇతర నిత్యావసర సరుకులు అందించారు.ఈ క్రమంలో దుబాయ్ లోని భారతీయ కాన్సులేటులోని కౌన్సల్ తాడు మాము తెలుగు అసోసియెషన్ ప్రతినిధులను అభినందించారు.దుబాయ్ లోని తెలుగు అసోసియేషన్ లు గతంలోనూ అనేక సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.

తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









