తెలంగాణ కరోనా అప్డేట్
- July 05, 2022
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది.రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. మంగళవారం రాష్ట్రంలో పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి.వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం..రాష్ట్రంలో నేడు మొత్తం 25,193 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 552 మంది కొవిడ్ భారిన పడ్డారు.
తెలంగాణలో ప్రస్తుతం 4,753 యాక్టివ్ కేసులు ఉన్నాయి.496 మంది కొవిడ్ తో చికిత్స పొందుతూ కోలుకున్నారు.దీంతో రికవరీ రేటు 98.90శాతంగా ఉంది.మంగళవారం కొవిడ్ తో చికిత్స పొందుతూ ఎవరూ మరణించలేదు.ఇదిలా ఉంటే తలెంగాణలో అత్యధికంగా హైదరాబాద్ లో కొత్తకేసులు నమోదయ్యాయి.
హైదరాబాద్ లో 316 మందికి కరోనా నిర్ధారణ కాగా, రంగారెడ్డిలో 51, మేడ్చల్ జిల్లాలో 36, సంగారెడ్డి జిల్లాలో 28, ఖమ్మంలో 14, నల్గొండ జిల్లాలో 12 మంది కొత్తగా కొవిడ్ భారిన పడ్డారు. రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించాలని వైద్య ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.మాస్క్ లేకుండా బయటకు వచ్చిన వారిపై జరిమానాలు సైతం విధిస్తామని ప్రభుత్వం తెలిపింది.
తాజా వార్తలు
- క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- ఘోర విమాన ప్రమాదం..110 మంది సైనికులతో వెళ్తుండగా ఘటన..
- మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రెండు లిఫ్ట్లు–త్వరలో పూర్తి
- ఆర్బీఐ ఎంపీసీ షెడ్యూల్ విడుదల
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
- శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- రోహిత్ రెడ్డికి 3 రోజుల పోలీస్ కస్టడీ..కోర్టు కీలక ఆదేశాలు!
- యుద్ధం పై ట్రంప్ కీలక ప్రకటన.. 5 రోజులు బ్రేక్
- ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
- దుబాయ్కు జజీరా ఎయిర్వేస్ విమాన సర్వీసులు పునఃప్రారంభం









