భారత్ కరోనా అప్డేట్
- July 07, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 18,930 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, గత 24 గంటల్లో 14,650 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా వల్ల కొత్తగా 35 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,19,457 మందికి చికిత్స అందుతోంది. యాక్టివ్ కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే 4,245 పెరిగింది.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.32 శాతంగా ఉంది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,29,21,977కి పెరిగింది. మృతుల సంఖ్య మొత్తం 5,25,305కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 198,33,18,772 కరోనా వ్యాక్సిన్ డోసులు వినియోగించారు. నిన్న 11,44,489 వ్యాక్సిన్ డోసులు వేశారు. కాగా, భారత్ లో ఒమిక్రాన్ వేరియంట్ బీఏ.2కి ఉపరకం బీఏ.2.75 వ్యాప్తి కూడా జరుగుతోంది. కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







