హ్యాకర్ల తాకిడి గురించి హెచ్చరించిన మోక్

- July 09, 2022 , by Maagulf
హ్యాకర్ల తాకిడి గురించి హెచ్చరించిన మోక్

కువైట్: మీ ఫోన్ కు వచ్చే అవాంచితమైన మరియు అనుమానిత ఈమెయిల్స్, మేసేజిలు మరియు లింకులు తెరవద్దని సమాచార మంత్రిత్వశాఖ పౌరులను హెచ్చరిక జారీ చేసింది. 

మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మిషాల్ అల్ జైద్ మాట్లాడుతూ తమ మంత్రిత్వశాఖ మరియు ఇతరత్రా ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఏటువంటి మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి మీ ఫోన్ కు రావని వెల్లడించారు. 

ఇటీవల కాలంలో దేశంలో సైబర్ నేరగాళ్లు సంఖ్య అధికంగా ఉన్న సందర్భంగా పౌరులను అప్రమత్తం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. 

ఇటువంటి అసంబద్ధ మేసేజీలు మరియు ఇతరత్రా వంటివి ప్రజలు తీవ్రంగా పరిగణించాలని అల్ జైద్ స్పష్టం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com