భారత్ కరోనా అప్డేట్

- July 10, 2022 , by Maagulf
భారత్ కరోనా అప్డేట్

న్యూ ఢిల్లీ: భార‌త్‌లో క‌రోనా కేసుల ఉద్ధృతి కొన‌సాగుతోంది.కొన్ని రోజులుగా 18 వేల‌కు పైనే రోజువారీ కేసులు న‌మోదవుతున్నాయి.దేశంలో గత‌ 24 గంటల్లో 18,257 కొత్త కేసులు, 42 మరణాలు నమోదయిన‌ట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.ప్రస్తుతం దేశంలో 1,28,690 యాక్టివ్ కేసులు ఉన్న‌ట్లు పేర్కొంది. వాటి శాతం 0.30గా ఉన్నట్లు వివ‌రించింది.

దేశంలో ఇప్పటివరకు మొత్తం 4,36,22,651 కేసులు, 5,25,428 మరణాలు నమోదయ్యాయ‌ని తెలిపింది.అలాగే, 98.50 శాతంగా కరోనా రికవరీ రేటు ఉందని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 14,553 మంది కోలుకున్నారు.ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య‌ 4,29,68,533గా ఉందని వివ‌రించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com