విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు
- July 10, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్తో.. తెలంగాణలో కుండపోత వానలు దంచికొడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్లు ఏకథాటిగా భారీ వర్షం పడుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముంది.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి భారీగా నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలి పెడుతున్నారు. మేడిగడ్డ దగ్గర నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్లోకి 5 లక్షల 58 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో 65 గేట్లు ఎత్తి 5 లక్షల 84 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







