విద్యా సంస్థలకు మూడు రోజులపాటు సెలవులు
- July 10, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో సోమ, మంగళ, బుధ వారాలు మూడు రోజులపాటు అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీఎస్ సహా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అల్పపీడన ద్రోణి ఎఫెక్ట్తో.. తెలంగాణలో కుండపోత వానలు దంచికొడుతున్నాయి. ఆకాశానికి చిల్లుపడినట్లు ఏకథాటిగా భారీ వర్షం పడుతూనే ఉంది. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మరికొన్ని రోజులు ఇదే స్థాయిలో వర్షాలు కురిస్తే ప్రాజెక్టుల్లో నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకునే అవకాశముంది.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం గూడెం గ్రామం అంతర్ రాష్ట్ర వంతెన దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి భారీగా నీరు చేరడంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలి పెడుతున్నారు. మేడిగడ్డ దగ్గర నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్లోకి 5 లక్షల 58 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీంతో 65 గేట్లు ఎత్తి 5 లక్షల 84 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం సరస్వతి బ్యారేజ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







