'జనసేన'కు కొత్త 'ఊపిరి'
- April 12, 2016
మార్చి 14వ తేదీ 2014వ సంవత్సరంలో పురుడు పోసుకున్న జనసేన పార్టీ తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో కొత్త ఊపిరి అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంలో ఉన్న కార్యకర్తలు ఏపీ తాత్కాలిక రాజధాని విజయవాడ వేదికగా సమావేశమయ్యారు. అంతేకాదు. పవన్ కళ్యాణ్ విజయవాడ నుండి పోటీ చేయాలని సరికొత్త 'పల్లవి' అందుకున్నారు.విజయవాడలో ఏర్పాటు చేసుకున్న 'జనసేన' పార్టీ కార్యకర్తల సమావేశంలో ఈ మేరకు విజయవాడ నుంచి పోటీ చేయాలని తీర్మానించుకున్నారు. వాస్తవానికి పార్టీ ఆవిర్భావం తరువాత జిల్లాల వారీగా జనసేన కార్యవర్గాలు ఏర్పాటు కాగా, ఎన్నికల్లో ఆ పార్టీ బరిలోకి దిగకపోవడంతో, కార్యకర్తలు సైతం తమ దారిలో తాము వెళ్లిపోయారు. తిరిగి అడపాదడపా క్రియాశీలకంగా ఉన్నట్టు కనిపించినా రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. అయితే పవన్ చేసిన తాజా వ్యాఖ్యలు వారిలో నూతన ఉత్సాహానికి కారణమయ్యాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







