అంతర్జాతీయ భారత మహిళ అవార్డు ఐశ్వర్యరాయ్కి..
- April 12, 2016
పనామా పేపర్స్ వివాదంలో చిక్కుకుని సతమతమవుతున్న తరుణంలో బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్కు ఇది సంతోషకరమైన వార్త. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ భారత మహిళ అవార్డు లభించింది. ముంబాయ్లో జరిగిన ప్రవాసీ భారతీయుల అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఐష్ 'గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ద ఇయర్' అవార్డు అందుకున్నారు. అయితే ఈ అవార్డును తన కూతురు ఆరాధ్యకు అంకితం చేసింది 42 సంవత్సరాల ఐశ్వర్య. ఐష్తో పాటు ప్రముఖ టన్నీస్ క్రీడాకారిణి సానియా మీర్జా కూడా ప్రత్యేక అవార్డు అందుకున్నారు. ఈ అవార్డును అంతర్జాతీయ వేదికపై భారతీయ మహిళ ఉన్నతిని పెంచేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నట్టు తెలిపింది ఐష్. మొదటి నుంచి కూడా తనకు లభించిన ప్రతి అవకాశాన్ని అలానే ఉపయోగించిన తనకు వ్యక్తిగతంగా, వృత్తిపరంగా, సామాజిక గుర్తింపుతో పాటు పలు అవకాశాలు లభించాయని గుర్తు చేసుకున్నారామె. ఈ ప్రవాసీ భారతీయ అవార్డుల ప్రధానోత్సవంలో మొత్తం 17 మంది వ్యక్తిగతంగా అవార్డులు స్వీకరించారు. అందులో వృత్తి, కళ, సంప్రదాయం, స్పెషల్ జ్యూరీ, గ్లోబల్ ఐకాన్, వ్యాపారం ఇలా పలు అంశాల వారీగా అవార్డులు ఇవ్వబడ్డాయి.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







