8 సంస్థలపై భారీగా జరిమానా విధించిన యూఏఈ
- July 11, 2022
యూఏఈ: దేశ చట్టాలను అతిక్రమణ చేస్తూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అవకతవకలకు పాల్పడిన కారణంగా 8 సంస్థలకు భారీగా జరిమానా విధించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దేశ ఆర్థిక వ్యవస్థను నష్ట పరిచేలా వ్యవహరిస్తున్న సంస్థలను తనిఖీ చేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార బృందం ఏర్పాటై తన కింద నమోదు చేయబడిన సుమారు 15000 సంస్థలలో సోదాలు నిర్వహించి 8 సంస్థల పై చర్యలు చేపట్టింది.
వివిధ చట్టాలను అతిక్రమణలు చేసినందుకు గాను ఈ సంస్థలపై సుమారు Dh 3.55 మిలియన్ల జరిమానా విధించినట్లు తెలిపింది.
ఆర్థిక మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగ అధిపతి మాట్లాడుతూ వివిధ చట్టాలను అతిక్రమణలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వారిపై తీసుకునే కఠిన చర్యల్లో భాగంగానే ఈ సంస్థల పై భారీ జరిమానా మరియు న్యాయ పరమైన చర్యలకు పునుకున్నామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







