8 సంస్థలపై భారీగా జరిమానా విధించిన యూఏఈ
- July 11, 2022
యూఏఈ: దేశ చట్టాలను అతిక్రమణ చేస్తూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అవకతవకలకు పాల్పడిన కారణంగా 8 సంస్థలకు భారీగా జరిమానా విధించినట్లు యూఏఈ ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది.
దేశ ఆర్థిక వ్యవస్థను నష్ట పరిచేలా వ్యవహరిస్తున్న సంస్థలను తనిఖీ చేసేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార బృందం ఏర్పాటై తన కింద నమోదు చేయబడిన సుమారు 15000 సంస్థలలో సోదాలు నిర్వహించి 8 సంస్థల పై చర్యలు చేపట్టింది.
వివిధ చట్టాలను అతిక్రమణలు చేసినందుకు గాను ఈ సంస్థలపై సుమారు Dh 3.55 మిలియన్ల జరిమానా విధించినట్లు తెలిపింది.
ఆర్థిక మంత్రిత్వశాఖకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ విభాగ అధిపతి మాట్లాడుతూ వివిధ చట్టాలను అతిక్రమణలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచే వారిపై తీసుకునే కఠిన చర్యల్లో భాగంగానే ఈ సంస్థల పై భారీ జరిమానా మరియు న్యాయ పరమైన చర్యలకు పునుకున్నామని ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







