మరో 3 రోజుల పాటు తెలంగాణలో విద్యా సంస్థలకు సెలవులు
- July 13, 2022
హైదరాబాద్: మరో మూడు రోజుల పాటు తెలగాణలోని పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగానే ఈ దిశగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వర్షాల కారణంగా ఇప్పటికే తెలంగాణలో విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సెలవులను మరో 3 రోజుల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజా ప్రకటనతో ఈ నెల 18న తిరిగి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. వాస్తవానికి తాజా ప్రకటనతో ఈ నెల 16 వరకే విద్యాలయాలకు సెలవులు ఉండగా… 17న ఆదివారం కావడంతో పాఠశాలలు ఈ నెల 18న సోమవారం పునఃప్రారంభం కానున్నాయి. మొత్తంగా వర్షాల కారణంగా ఈ వారం మొత్తం పాఠశాలలు తెరచుకోలేదు.
గత శనివారం పని చేసిన పాఠశాలలు ఆదివారం సెలవుతో తిరిగి సోమవారం ప్రారంభం కావాల్సి ఉండగా… వర్షాల కారణంగా 3 రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవులు ముగియనున్న బుధవారం మరో 3 రోజుల పాటు సెలవులను పొడిగించారు. వెరసి తెలంగాణలో వరుసగా 8 రోజుల పాటు విద్యాలయాలు మూపడిపోయినట్టైంది.
తాజా వార్తలు
- హైదరాబాద్ విమానాశ్రయానికి అవార్డు
- ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
- చైనాలో భారత రాయబారిగా విక్రమ్ దొరైస్వామి
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!









