బహ్రెయిన్ లో నీట్ పరీక్ష
- July 13, 2022
మనామా: ఇండియా లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) ను తొలిసారిగా బహ్రెయిన్ లో నిర్వహించనుంది. జూలై 17,2022 న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:50 వరకు వివిధ దశల్లో మనామా లోని ఇండియన్ బహ్రెయిన్ స్కూల్ క్యాంపస్ లో నీట్ ను నిర్వహించనున్నట్లు అధికారిక సమాచారం. అర్హత కలిగిన వారు కచ్చితంగా హాజరు కావాలని నిర్వహకులు తెలిపారు. ఈ పరీక్షను ఇండియాకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుండగా , ఫలితాలను అరోగ్య మంత్రిత్వశాఖ కింద పనిచేసే అరోగ్య సేవల విభాగం విడుదల చేస్తుంది. సీట్ల భర్తీని మాత్రం వివిధ రాష్ట్రాల అధికారిక విద్యా కౌన్సిలింగ్ బోర్డులు ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. పూర్వం ఈ ప్రవేశ పరీక్ష ను అఖిల భారత ప్రీ మెడికల్ టెస్ట్(AIPMT) గా పిలిచేవారు, దీని స్థానంలో ప్రస్తుతం నీట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- దుబాయ్ విమానయాన రంగం పునరుద్ధరణ పై సీఈఓ పాల్ గ్రిఫిత్స్ ధీమా!
- వాతావరణంలో రేడియేషన్ స్థాయిలపై కువైట్ క్లారిటీ..!!









