బహ్రెయిన్ లో నీట్ పరీక్ష
- July 13, 2022
మనామా: ఇండియా లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) ను తొలిసారిగా బహ్రెయిన్ లో నిర్వహించనుంది. జూలై 17,2022 న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:50 వరకు వివిధ దశల్లో మనామా లోని ఇండియన్ బహ్రెయిన్ స్కూల్ క్యాంపస్ లో నీట్ ను నిర్వహించనున్నట్లు అధికారిక సమాచారం. అర్హత కలిగిన వారు కచ్చితంగా హాజరు కావాలని నిర్వహకులు తెలిపారు. ఈ పరీక్షను ఇండియాకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుండగా , ఫలితాలను అరోగ్య మంత్రిత్వశాఖ కింద పనిచేసే అరోగ్య సేవల విభాగం విడుదల చేస్తుంది. సీట్ల భర్తీని మాత్రం వివిధ రాష్ట్రాల అధికారిక విద్యా కౌన్సిలింగ్ బోర్డులు ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. పూర్వం ఈ ప్రవేశ పరీక్ష ను అఖిల భారత ప్రీ మెడికల్ టెస్ట్(AIPMT) గా పిలిచేవారు, దీని స్థానంలో ప్రస్తుతం నీట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!







