బహ్రెయిన్ లో నీట్ పరీక్ష
- July 13, 2022
మనామా: ఇండియా లో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్యను అభ్యసించేందుకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (NEET) ను తొలిసారిగా బహ్రెయిన్ లో నిర్వహించనుంది. జూలై 17,2022 న ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 2:50 వరకు వివిధ దశల్లో మనామా లోని ఇండియన్ బహ్రెయిన్ స్కూల్ క్యాంపస్ లో నీట్ ను నిర్వహించనున్నట్లు అధికారిక సమాచారం. అర్హత కలిగిన వారు కచ్చితంగా హాజరు కావాలని నిర్వహకులు తెలిపారు. ఈ పరీక్షను ఇండియాకు చెందిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుండగా , ఫలితాలను అరోగ్య మంత్రిత్వశాఖ కింద పనిచేసే అరోగ్య సేవల విభాగం విడుదల చేస్తుంది. సీట్ల భర్తీని మాత్రం వివిధ రాష్ట్రాల అధికారిక విద్యా కౌన్సిలింగ్ బోర్డులు ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. పూర్వం ఈ ప్రవేశ పరీక్ష ను అఖిల భారత ప్రీ మెడికల్ టెస్ట్(AIPMT) గా పిలిచేవారు, దీని స్థానంలో ప్రస్తుతం నీట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







