షాకింగ్ న్యూస్: రాజకీయాల్లోకి రష్మిక మండన్నా.?
- July 18, 2022
టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్గా చెలామణీ అవుతోన్న రష్మికా మండన్నా మరోవైపు కోలీవుడ్నీ, ఏలుతోంది. బాలీవుడ్లోనూ ఈ మధ్యనే పాగా వేసింది. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ హీరోయిన్గా స్టార్డమ్ దక్కించుకుంది.
అంతా బాగానే వుంది. కెరీర్ పీక్స్లో వున్న టైమ్లో రష్మిక రాజకీయాల ప్రస్థావన ఏంటీ.? రాజకీయాల్లో చక్రం తిప్పగల వయసు కానీ, అనుభవం కానీ రష్మికకున్నాయా.? అసలింతకీ రష్మిక రాజకీయాల గోలేంటీ.? అనుకుంటున్నారా.? అయితే మీకీ విషయం తెలియాల్సిందే.
ఈ మధ్య వేణు స్వామి అనే జ్యోతిష్య పండితుడు తన పాపులారిటీని పెంచుకునేందుకు పాపులర్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్న సంగతి తెలిసే వుంటుంది.
సమంత, చైతూ విడాకులు తీసుకుంటారని ఈ ప్రబుద్ధుడు ముందే చెప్పేశాడట. అలాగే, నయన్ తారకి పెళ్లి అచ్చి రాదనే విషయం కూడా ఈ మధ్య ఈయన ప్రస్థావించిన సంగతి తెలిసిందే. వీళ్లే కాదు, ఇలాంటి పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై తన నోటికి వచ్చినట్లు వాగుతూ, ట్రెండింగ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
అలాగే, రష్మిక మండన్నా రాజకీయాల్లోకి వస్తుందంటూ ఈ మేథావిగారు ముందే జోస్యం చెప్పేశారు. మరి, సినిమాలకు గుడ్ బై చెప్పేసి, రష్మిక రాజకీయాల్లో అడుగు పెట్టేస్తుందా.. స్వామి వారి మాట విని. ఏమో.! పెరుమాళ్లకే ఎరుక.
తాజా వార్తలు
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం
- 98% మురుగునీటి శుద్ధి..పునర్వినియోగంలో అష్ఘల్ విజయం..!!
- బహ్రెయిన్ వాసులకు వీసా రహిత షెంజెన్ ప్రయాణం..జర్మనీ కృషి..!!
- అల్-అహ్మదీలో స్పెషల్ డ్రైవ్..8 దుకాణాలు సీజ్..!!
- ఒమన్ లో చేపల ధరలపై పర్యవేక్షణ బలోపేతం..!!
- సౌదీలో 385 మందిపై విచారణ, 130 మంది అరెస్టు..!!
- సోషల్ మీడియాలో సమ్మర్ ట్రావెల్ ప్లాన్స్ షేరింగ్.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!







