షాకింగ్ న్యూస్: రాజకీయాల్లోకి రష్మిక మండన్నా.?
- July 18, 2022
టాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్గా చెలామణీ అవుతోన్న రష్మికా మండన్నా మరోవైపు కోలీవుడ్నీ, ఏలుతోంది. బాలీవుడ్లోనూ ఈ మధ్యనే పాగా వేసింది. ‘పుష్ప’ సినిమాతో ప్యాన్ ఇండియా రేంజ్ హీరోయిన్గా స్టార్డమ్ దక్కించుకుంది.
అంతా బాగానే వుంది. కెరీర్ పీక్స్లో వున్న టైమ్లో రష్మిక రాజకీయాల ప్రస్థావన ఏంటీ.? రాజకీయాల్లో చక్రం తిప్పగల వయసు కానీ, అనుభవం కానీ రష్మికకున్నాయా.? అసలింతకీ రష్మిక రాజకీయాల గోలేంటీ.? అనుకుంటున్నారా.? అయితే మీకీ విషయం తెలియాల్సిందే.
ఈ మధ్య వేణు స్వామి అనే జ్యోతిష్య పండితుడు తన పాపులారిటీని పెంచుకునేందుకు పాపులర్ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తున్న సంగతి తెలిసే వుంటుంది.
సమంత, చైతూ విడాకులు తీసుకుంటారని ఈ ప్రబుద్ధుడు ముందే చెప్పేశాడట. అలాగే, నయన్ తారకి పెళ్లి అచ్చి రాదనే విషయం కూడా ఈ మధ్య ఈయన ప్రస్థావించిన సంగతి తెలిసిందే. వీళ్లే కాదు, ఇలాంటి పలువురు సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై తన నోటికి వచ్చినట్లు వాగుతూ, ట్రెండింగ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు.
అలాగే, రష్మిక మండన్నా రాజకీయాల్లోకి వస్తుందంటూ ఈ మేథావిగారు ముందే జోస్యం చెప్పేశారు. మరి, సినిమాలకు గుడ్ బై చెప్పేసి, రష్మిక రాజకీయాల్లో అడుగు పెట్టేస్తుందా.. స్వామి వారి మాట విని. ఏమో.! పెరుమాళ్లకే ఎరుక.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









