భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు మిస్సింగ్..
- July 19, 2022
భారత్-చైనా సరిహద్దులో 19 మంది కార్మికులు అదృశ్యం కాగా ఒకరు విగతజీవిగా కనిపించారు. అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపించకుండాపోయారు. రాజధాని ఇటానగర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది.కాగా ఈ 19 మందిలో ఒకరు విగతజీవిగా కనిపించారు. దీనిపై కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే కార్మికులు అదృశ్యమయ్యారు. అయితే కుమే నదిలో ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 19 మంది కార్మికులు అస్సాం నుంచి వలస వచ్చినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్టర్ కార్మికులకు లీవ్ ఇవ్వలేదని తెలుస్తోంది.
తాజా వార్తలు
- మేడ్ ఇన్ అమరావతి క్వాంటం హార్డ్ వేర్ లక్ష్యం
- WhatsApp new feature:మెసేజ్లు ఓపెన్ చేయకుండానే సారాంశం చూసేయండి!
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!









