భారత్ కరోనా అప్డేట్
- July 20, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,25,825కి చేరిందని తెలిపింది. దేశంలో హోం క్వారంటైన్లు, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 1,45,654కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
నిన్నటికంటే యాక్టివ్ కేసుల సంఖ్య 2,000 పెరిగిందని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,32,140కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో బూస్టర్ డోసును ఉచితంగా ఇస్తున్నారు. నిన్న దేశంలో 26,04,797 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఇప్పటివరకు వేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200,61,24,684కి చేరిందని తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీ బడ్జెట్ 2026-27: దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
- అంతర్జాతీయ మాదకద్రవ్య ముఠాను ఛేదించిన యూఏఈ, కువైట్..!!
- కువైట్ ఎంబసీలో నేషనల్, లిబరేషన్ డే సెలబ్రేషన్స్..!!
- GCC లో పనిచేసే బహ్రెయిన్లకు నిరుద్యోగ బీమా..!!
- ఖసాబ్ లో భూకంపం వివరాలు వెల్లడి..!!
- ఖతార్ లో రెండు రోజులపాటు స్ట్రాంగ్ విండ్స్..!!
- గాజా సంక్షోభం .. గ్లోబల్ వైఫల్యం: సౌదీ FM
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం









