భారత్ కరోనా అప్డేట్
- July 20, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 24 గంటల్లో 18,517 మంది కరోనా నుంచి కోలుకున్నారని పేర్కొంది. కరోనా వల్ల మరో 40 మంది ప్రాణాలు కోల్పోయారని, దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ వల్ల మృతి చెందిన వారి సంఖ్య 5,25,825కి చేరిందని తెలిపింది. దేశంలో హోం క్వారంటైన్లు, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 1,45,654కు చేరిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.
నిన్నటికంటే యాక్టివ్ కేసుల సంఖ్య 2,000 పెరిగిందని తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,31,32,140కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 4.13 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రభుత్వ కేంద్రాల్లో బూస్టర్ డోసును ఉచితంగా ఇస్తున్నారు. నిన్న దేశంలో 26,04,797 డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వివరించింది. దీంతో ఇప్పటివరకు వేసిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 200,61,24,684కి చేరిందని తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









