యూఏఈలో గంజాయి సాగుచేస్తున్న ఇద్దరు అరెస్ట్
- July 20, 2022
యూఏఈ: తమ యజమాని పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను అబుదాబి పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో అబుదాబి పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న 14 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై అభియోగాలు నమోదు చేశారు. గంజాయి మొక్కలను నిర్మూలించాలని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ తాహెర్ గరీబ్ అల్ ధాహెరి మాట్లాడుతూ.. వ్యవసాయ యజమానులు పొలాల వద్ద తమ కార్మికులపై నిఘా పెట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పెంచడం వంటివి కన్పిస్తే అధికారులకు నివేదించాలని అల్ ధాహెరి వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సూచించారు. మాదకద్రవ్యాలను అరికట్టడానికి.. పెడ్లర్లు, వినియోగదారుల సమాచారం తెలిస్తే 999 లేదా 8002626 ద్వారా తెలపాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









