యూఏఈలో గంజాయి సాగుచేస్తున్న ఇద్దరు అరెస్ట్
- July 20, 2022
యూఏఈ: తమ యజమాని పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను అబుదాబి పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో అబుదాబి పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న 14 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై అభియోగాలు నమోదు చేశారు. గంజాయి మొక్కలను నిర్మూలించాలని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ తాహెర్ గరీబ్ అల్ ధాహెరి మాట్లాడుతూ.. వ్యవసాయ యజమానులు పొలాల వద్ద తమ కార్మికులపై నిఘా పెట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పెంచడం వంటివి కన్పిస్తే అధికారులకు నివేదించాలని అల్ ధాహెరి వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సూచించారు. మాదకద్రవ్యాలను అరికట్టడానికి.. పెడ్లర్లు, వినియోగదారుల సమాచారం తెలిస్తే 999 లేదా 8002626 ద్వారా తెలపాలని కోరారు.
తాజా వార్తలు
- ఈ నెల 17న ఆకాశంలో అద్భుతం జరగబోతుంది !!
- బెంగళూరులో ఘోర ప్రమాదం, ఐదుగురు యువకుల మృతి
- మలేషియాలో ఏపీ వాసి మృతి
- తెలంగాణ: రేపే మేయర్లు, ఛైర్పర్సన్ల ఎన్నిక
- పాక్ను చిత్తుగా ఓడించిన భారత్..
- తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకారానికి స్పీకర్ ఓం బిర్లా!
- తాజా పరిణామాలపై అమీర్, యూఏఈ అధ్యక్షుడు చర్చలు..!!
- ఎక్సెప్షనల్ టాలెంట్ ప్రీమియం రెసిడెన్సీకి గైడ్ లైన్స్..!!
- యూఏఈలో ఫ్రాడ్ కేసు..ఇద్దరికి 3 ఏళ్ల జైలుశిక్ష..!!
- కువైట్లో భారత్ మేళా 2026 విజయవంతం..!!









