యూఏఈలో గంజాయి సాగుచేస్తున్న ఇద్దరు అరెస్ట్
- July 20, 2022
యూఏఈ: తమ యజమాని పొలంలో గంజాయి మొక్కలు పెంచుతున్న ఇద్దరు వ్యక్తులను అబుదాబి పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు సమాచారం అందడంతో అబుదాబి పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో పెంచుతున్న 14 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని ఇద్దరిపై అభియోగాలు నమోదు చేశారు. గంజాయి మొక్కలను నిర్మూలించాలని ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆదేశించింది. క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్లోని యాంటీ నార్కోటిక్స్ డైరెక్టరేట్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ తాహెర్ గరీబ్ అల్ ధాహెరి మాట్లాడుతూ.. వ్యవసాయ యజమానులు పొలాల వద్ద తమ కార్మికులపై నిఘా పెట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలను పెంచడం వంటివి కన్పిస్తే అధికారులకు నివేదించాలని అల్ ధాహెరి వ్యవసాయ క్షేత్రాల యజమానులకు సూచించారు. మాదకద్రవ్యాలను అరికట్టడానికి.. పెడ్లర్లు, వినియోగదారుల సమాచారం తెలిస్తే 999 లేదా 8002626 ద్వారా తెలపాలని కోరారు.
తాజా వార్తలు
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..







