గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..50°Cకి చేరుకునే అవకాశం
- July 20, 2022
సౌదీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరగడం అందోళన కలిగిస్తోంది. గల్ఫ్లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు దాదాపు 50°Cకి చేరుకుంటాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మంగళవారం నాడు దమ్మామ్ నగరంలో 48 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని.. ఇది రాజ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొంది. ఆ తర్వాత అల్-ఖర్జ్ నగరంలో 46°C, రాజధాని నగరం రియాద్లో 45 °C నమోదైందని ప్రకటించింది. మరోవైపు కువైట్లో ఈ వారంలో (బుధవారం నుండి శనివారం) ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ నుండి 50 ° C వరకు నమోదయ్యే అవకాశం ఉందని కువైట్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒమన్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం, చురుకైన గాలులు వీచే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ జనరల్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







