కువైట్-ముంబై విమానంలో పొగతాగిన ప్రయాణికుడు అరెస్టు
- July 20, 2022
కువైట్: కువైట్-ముంబై విమానంలో పొగతాగిన 50 ఏళ్ల ప్రయాణికుడిని ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత భద్రతా అధికారులు అరెస్టు చేశారు. భారతీయ మీడియా కథనం ప్రకారం.. మంగళవారం మహ్మద్ షాహిద్ కువైట్ నుండి ముంబై వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగానే వాష్రూమ్లోకి వెళ్లి స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. పొగను గమనించిన సిబ్బంది.. ఆ తర్వాత పొగతాగడం ఆపేయాలని కోరారు.విమానం ముంబైలో దిగిన తర్వాత మహ్మద్ షాహిద్ పై భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై IPCలోని సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), ఎయిర్క్రాఫ్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని బెయిల్పై విడుదల చేశారు. అనంతరం మహ్మద్ షాహిద్ మాట్లాడుతూ.. విమానంలో స్మోకింగ్ నిషేధం అన్న విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







