కువైట్-ముంబై విమానంలో పొగతాగిన ప్రయాణికుడు అరెస్టు
- July 20, 2022
కువైట్: కువైట్-ముంబై విమానంలో పొగతాగిన 50 ఏళ్ల ప్రయాణికుడిని ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత భద్రతా అధికారులు అరెస్టు చేశారు. భారతీయ మీడియా కథనం ప్రకారం.. మంగళవారం మహ్మద్ షాహిద్ కువైట్ నుండి ముంబై వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగానే వాష్రూమ్లోకి వెళ్లి స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. పొగను గమనించిన సిబ్బంది.. ఆ తర్వాత పొగతాగడం ఆపేయాలని కోరారు.విమానం ముంబైలో దిగిన తర్వాత మహ్మద్ షాహిద్ పై భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై IPCలోని సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), ఎయిర్క్రాఫ్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని బెయిల్పై విడుదల చేశారు. అనంతరం మహ్మద్ షాహిద్ మాట్లాడుతూ.. విమానంలో స్మోకింగ్ నిషేధం అన్న విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









