కువైట్-ముంబై విమానంలో పొగతాగిన ప్రయాణికుడు అరెస్టు
- July 20, 2022
కువైట్: కువైట్-ముంబై విమానంలో పొగతాగిన 50 ఏళ్ల ప్రయాణికుడిని ముంబై విమానాశ్రయంలో దిగిన తర్వాత భద్రతా అధికారులు అరెస్టు చేశారు. భారతీయ మీడియా కథనం ప్రకారం.. మంగళవారం మహ్మద్ షాహిద్ కువైట్ నుండి ముంబై వెళ్లేందుకు ఇండిగో విమానం ఎక్కాడు. విమానం గాలిలో ఉండగానే వాష్రూమ్లోకి వెళ్లి స్మోకింగ్ చేయడం ప్రారంభించాడు. పొగను గమనించిన సిబ్బంది.. ఆ తర్వాత పొగతాగడం ఆపేయాలని కోరారు.విమానం ముంబైలో దిగిన తర్వాత మహ్మద్ షాహిద్ పై భద్రతా అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతనిపై IPCలోని సెక్షన్ 336 (ఇతరుల ప్రాణాలకు లేదా వ్యక్తిగత భద్రతకు హాని కలిగించే చట్టం), ఎయిర్క్రాఫ్ట్ చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని బెయిల్పై విడుదల చేశారు. అనంతరం మహ్మద్ షాహిద్ మాట్లాడుతూ.. విమానంలో స్మోకింగ్ నిషేధం అన్న విషయం తనకు తెలియదని చెప్పడం గమనార్హం.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







