గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..50°Cకి చేరుకునే అవకాశం
- July 20, 2022
సౌదీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరగడం అందోళన కలిగిస్తోంది. గల్ఫ్లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు దాదాపు 50°Cకి చేరుకుంటాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మంగళవారం నాడు దమ్మామ్ నగరంలో 48 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని.. ఇది రాజ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొంది. ఆ తర్వాత అల్-ఖర్జ్ నగరంలో 46°C, రాజధాని నగరం రియాద్లో 45 °C నమోదైందని ప్రకటించింది. మరోవైపు కువైట్లో ఈ వారంలో (బుధవారం నుండి శనివారం) ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ నుండి 50 ° C వరకు నమోదయ్యే అవకాశం ఉందని కువైట్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒమన్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం, చురుకైన గాలులు వీచే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ జనరల్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







