గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..50°Cకి చేరుకునే అవకాశం
- July 20, 2022
సౌదీ: గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (GCC) రాష్ట్రాలలోని చాలా ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు పెరగడం అందోళన కలిగిస్తోంది. గల్ఫ్లోని కొన్ని ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు దాదాపు 50°Cకి చేరుకుంటాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం (NCM) తెలిపింది. మంగళవారం నాడు దమ్మామ్ నగరంలో 48 డిగ్రీల సెల్సియస్గా నమోదైందని.. ఇది రాజ్యంలో అత్యధిక ఉష్ణోగ్రత అని పేర్కొంది. ఆ తర్వాత అల్-ఖర్జ్ నగరంలో 46°C, రాజధాని నగరం రియాద్లో 45 °C నమోదైందని ప్రకటించింది. మరోవైపు కువైట్లో ఈ వారంలో (బుధవారం నుండి శనివారం) ఉష్ణోగ్రతలు 49 డిగ్రీల సెల్సియస్ నుండి 50 ° C వరకు నమోదయ్యే అవకాశం ఉందని కువైట్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఒమన్ లోని కొన్ని ప్రాంతాలలో వర్షపాతం, చురుకైన గాలులు వీచే అవకాశం ఉందని ఒమన్ వాతావరణ శాస్త్ర డైరెక్టరేట్ జనరల్ హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









