APSRTC బంపరాఫర్...
- July 20, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(APSRTC) బంపరాఫర్ ప్రకటించింది. తమ కొత్త బ్రాండ్కు మంచి పేరు చెప్పిన వారికి క్యాష్ ప్రైజ్ గెలుచుకునే అద్భుత అవకాశం కల్పించింది. ‘చిన్న సలహా ఇవ్వండి.. క్యాష్ ప్రైజ్ సొంతం చేసుకోండి’ అని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది. ఆర్టీసీ కొత్తగా తీసుకొస్తున్న నాన్ ఏసీ స్లీపర్ కోచ్ బస్సు సర్వీసులకు మంచి పేరు చెప్పాలని రాష్ట్ర ప్రజలను కోరింది.
ఈ అవకాశాన్ని వినియోగించి బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా తమ సర్వీసులకు పేరును సూచించాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు విజ్ఞప్తి చేశారు. ఈ నాన్ ఏసీ స్లీపర్ బస్సుల్లో 30 బెర్త్లు ఉంటాయి. తొలిసారి ఏపీలో ఈ బస్సుల్ని తీసుకువస్తున్నారు. దూరప్రాంత ప్రయాణికుల కోసం అద్దె ప్రాతిపదికన ఈ నాన్ ఏసీ స్లీపర్ కోచ్లను ప్రవేశపెడుతున్నారు. ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా రేట్లను సిద్ధం చేస్తున్నారు.
ఈ స్లీపర్ కోచ్లో ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత ఫ్యాన్, లైట్ ఉంటుంది. ఈ నాన్ ఏసీ స్లీపర్ కోచ్లను తీసుకువచ్చి ప్రయాణికులను ఆకర్షించేలా ఆర్టీసీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని భావిస్తున్నారు. అందుకే స్లీపర్ కోచ్లకు మంచి పేరు సూచించాలని ఎండీ కోరుతున్నారు.ఈ నెల 24లోగా తగిన పేరు సూచించిన వారికి అవార్డుతోపాటు నగదు రివార్డు అందజేయనున్నారు.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







