జిలీబ్ ప్రాంతంలో తగ్గిన ప్రవాసుల సంఖ్య
- July 21, 2022
కువైట్: జిలీబ్ ప్రాంతంలో నివసించే వారి సంఖ్య తగ్గినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. డేటా ప్రకారం.. 2021 చివరి నాటికి జిలీబ్ లో నివసించే వారి సంఖ్య 271,000కి చేరుకుంది. 2019లో ఆ ప్రాంతంలో సుమారు 328,000 మంది ప్రజలు నివసించేవారు. 56,779 మంది వివిధ ప్రాంతాలకు మకాం మారినట్లు అధికారిక లెక్కలను బట్టి తెలుస్తోంది. అధిక సంఖ్యలో ప్రవాసులు నివసించే రెండవ అత్యంత రద్దీ ప్రాంతంగా జిలీబ్ ఉండేది. రెసిడెన్సీ నిబంధనలు ఉల్లంఘించేవారు పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతంలో ఉంటున్నట్లు తేలడంతో.. ఈ ప్రాంతంలో భద్రతా తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రవాసులు వివిధ ప్రాంతాలకు మకాం మార్చినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- T20WorldCup2026: ఆస్ట్రేలియా ఇంటికే..!
- ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం
- కొత్తగా ఎన్నికైన మేయర్, డిప్యూటీ మేయర్లు వీళ్లే
- 'రాయల్' ఫోటోగ్రాఫర్ రమేష్ శుక్లాకు షేక్ హమ్దాన్ నివాళి..!!
- ఒమన్ లో పోలీసుల అధికారిక వర్కింగ్ అవర్స్ ఇవే..!!
- సౌదీలో డొమెక్టిక్ వర్కర్స్ తొలగింపునకు అనుమతి..!!
- బహ్రెయిన్ వార్షిక ఫైన్ ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఖతార్ లో ఆహార సంస్థల పై నిఘా ముమ్మరం..!!
- రమదాన్..మస్జీదులలో కె-నెట్ పరికరాలపై నిషేధం..!!
- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కీలక పొలిటికల్ హామీ









