దుబాయ్లోని వాణిజ్య భూములపై నియంత్రణ.. డిక్రీ జారీ
- July 21, 2022
దుబాయ్: దుబాయ్లోని వాణిజ్య భూములపై ‘ముసతహా’ హక్కుల మంజూరును నియంత్రిస్తూ 2022 డిక్రీ నంబర్ (23)ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లను అభివృద్ధి చేయడానికి 'ముసతహా' హక్కును మంజూరు చేయడం ద్వారా దుబాయ్లోని వాణిజ్య భూముల వినియోగాన్ని డిక్రీ నియంత్రిస్తుంది. గ్లోబల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా దుబాయ్ ని మార్చే ప్రయత్నాలలో కొత్త చట్టం భాగమని అధికారులు తెలిపారు. కొత్త డిక్రీ ప్రకారం.. 'ముసతహా' ఒప్పందం దాని హోల్డర్కు భవనాన్ని నిర్మించడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి, తనఖా పెట్టడానికి, లీజుకు, విక్రయించడానికి లేదా మూడవ పక్షానికి చెందిన ప్లాట్ను గరిష్ట కాలం(35 ఏళ్లు) వరకు కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తుంది. ఈ ఒప్పందాన్ని గరిష్టంగా 50 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
తాజా వార్తలు
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం
- ప్రధాని మోదీ విదేశీ పర్యటన: 6 నుంచి 11 వరకు మూడు దేశాల టూర్
- ఇది కదా అసలైన భక్తి..116ఏళ్ల వయసులో కాలినడకన తిరుమలకు..!
- కవిత పార్టీకి ఈసీ షాక్..పేరు మార్చాల్సిందే!
- యూఏఈ తొలి హైస్పీడ్ రైలును నడిపిన తెలుగు యువకుడు..
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..







