హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు..
- April 13, 2016
తెలంగాణలో మండుతున్న ఎండలకు తోడు వడగాల్పులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇంటా, బయట ఉక్కపోతతో జనం బేజారెత్తిపోతున్నారు. మంగళవారం హైదరాబాద్లో గరిష్టంగా 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వాతవారణశాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రెండు రోజుల పాటు అత్యవసర పనులు ఉంటే తప్ప ఎండలో బయటకు వెళ్లొద్దని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణిలు ఎండబారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు.
తాజా వార్తలు
- నకిలీ హజ్ సేవల ప్రచారం..ఈజిప్షియన్ అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాల పై కింగ్ సుల్తాన్, ఖతార్ ఎమిర్ చర్చలు..!!
- గడువు ముగిసిన ఫైనాన్స్ సర్టిఫికేట్లు..మరో 3 నెలల పాటు పొడిగింపు..!!
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర









