మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- April 16, 2026
సైబరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపిన మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రధాన నిందితుడు రమావత్ మధును సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ (EOW) అధికారులు అరెస్ట్ చేశారు.
మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మధును అదుపులోకి తీసుకున్న పోలీసులు, విచారణను వేగవంతం చేశారు.మధు మరియు అతని బృందం అమాయకుల నుంచి భారీగా నగదు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 60కి పైగా కేసులు నమోదయ్యాయి.ఇప్పటికే సీఐడీ ఈ కేసును విచారిస్తుండగా, తాజాగా సైబరాబాద్ EOW లో కూడా కేసు నమోదు కావడంతో మధు చుట్టూ ఉచ్చు బిగిసింది.
కాగా మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ సింగర్ మంగ్లీ పేరు తెరపైకి వచ్చింది. మంగ్లీ పై లాయర్ సుబ్బారావు తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బు వసూళ్ల వ్యవహారంలో మంగ్లీ ప్రమేయం ఉందని లాయర్ సుబ్బారావు అంటున్నారు. లాయర్ సుబ్బారావు ఆరోపణలపై మంగ్లీ తీవ్రంగా స్పందించారు. ఆయన ఆరోపణలను మంగ్లీ కొట్టిపడేశారు. మైక్రో ఫైనాన్స్ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనను బద్నాం చేసేందుకు కుట్ర జరుగుతోందన్నారు. ఈ కేసుతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమే అని మంగ్లీ తేల్చి చెప్పారు. లాయర్ సుబ్బారావుపై మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







