Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ.. ఐదుగురుకి జైలు శిక్ష

- July 22, 2022 , by Maagulf
Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ.. ఐదుగురుకి జైలు శిక్ష

దుబాయ్: Dhs 80,000 విలువైన ఎలక్ట్రానిక్ సిగరెట్ల చోరీ కేసులో దుబాయ్ క్రిమినల్ కోర్ట్ ఐదుగురు ఆసియా వ్యక్తులకు జైలు శిక్ష విధించింది. ఒక్కొక్కరికి 3 నెలల జైలు శిక్ష వేసింది. ఒక ఆసియా డ్రైవర్‌కు చెందిన వాహనం నుండి 6,000 దిర్హాంతో పాటు 19 బాక్సుల ఎలక్ట్రానిక్ సిగరెట్లను దొంగిలించినందుకు వారికి ఈ శిక్షలను కోర్టు ఖరారు చేసింది. శిక్షాకాలం ముగిసిన తర్వాత దోషులను దేశం నుంచి బహిష్కరించాలని కోర్టు తీర్పునిచ్చింది. ఈ సంఘటన గత మార్చిలో చోటు చేసుకుంది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు సీఐడీ బృందం విచారణ చేపట్టి నిందితులను గుర్తించి అరెస్ట్ చేసింది. చోరీకి పాల్పడినట్లు నిందితులు అంగీకరించారని, వాటిలో ఒకటి రెండు వాహనాల ద్వారా దొంగిలించిన వస్తువులను రవాణా చేసినట్లు అంగీకరించారని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com