డిజిటల్ మాధ్యమాల ద్వారా ఫేక్ న్యూస్ వ్యాప్తి పై కఠిన చర్యలు
- July 22, 2022
న్యూ ఢిల్లీ: సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెళ్ల ద్వారా నకిలీ వార్తల కట్టడికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని యూట్యూబ్ ఛానెళ్లను నిషేధించిన కేంద్రం… ఇప్పుడు మరికొన్ని సోషల్ మీడియా ఖాతాలు, యూట్యూబ్ ఛానెల్స్పై చర్యలు తీసుకుంది. 2012-22 మధ్య కాలంలో అసత్య వార్తలను ప్రసారం చేస్తున్న 94 యూట్యూబ్ ఛానెళ్లు, 19 సోషల్ మీడియా ఖాతాలు, 747 URLలపై నిషేధం విధించినట్లు వెల్లడించింది.
దేశ సార్వభౌమాధికారానికి వ్యతిరేకంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాలో నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ప్రసారమాధ్యమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఈ మేరకు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు … కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడించారు.
డిజిటల్ మాధ్యమాల ద్వారా నకిలీ వార్తల వ్యాప్తి కట్టడికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2020 కింద… గతేడాది ఫిబ్రవరి 25న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021ను రూపొందించినట్లు మంత్రి తెలిపారు. దీని ప్రకారం ఏదైనా యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా ఖాతా కేంద్ర ప్రభుత్వ నిబంధనలు, కోడ్లు ఉల్లంఘించినట్లు గుర్తిస్తే…. చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు.
అలానే నకిలీ వార్తలు వ్యాప్తి చెందకుండా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆధ్యర్యంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 2009 నవంబర్లో నిజనిర్ధారణ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







