హైదరాబాద్ రోడ్ల పై కొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సులు
- July 23, 2022
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై కొత్త ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టబోతున్నాయి. ఫేమ్-2 పథకం కింద 300 బస్సులు తీసుకోనేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ నుంచి ఈ వాహనాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ.500 కోట్లను చెల్లించనుంది. 12 సంవత్సరాలకు గానూ… గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్ధతిలో ఈ బస్సులను తీసుకోనుంది. వచ్చే 20 నెలల్లో ఈ బస్సులను ఒలెక్ట్రా.. టీఎస్ఆర్టీసీకి అప్పగించనుంది.వీటి నిర్వహణ బాధ్యతలను ఒలెక్ట్రా చూడనుంది. ప్రతి సీటుకు ఎమర్జెన్సీ బటన్ తో పాటు USB సాకెట్ ఉంటుంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 200 కిమీ వరకు ప్రయాణం చేస్తుంది.
ఈ బస్సులు 12-మీటర్లు, లో ఫ్లోర్, నాన్-ఏసీ బస్సులు 35+డి సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్తో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్లు ఉంటాయి. బస్సులో అమర్చిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ట్రాఫిక్, ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఒక ఛార్జ్తో 180 కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తుంది.
ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ మరో ప్రతిష్టాత్మకమైన ఆర్డర్ను దక్కించుకోవడం సంతోషంగా ఉందన్నారు. తమ అత్యాధునిక జీరో-ఎమిషన్ బస్సులతో తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నందుకు గర్విస్తున్నామని తెలిపారు. ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా తమ బస్సులు హైదరాబాద్లో సేవలు అందిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రయాణికులను విమానాశ్రయానికి విజయవంతంగా చేరవేస్తూ సేవలు అందిస్తున్నాయని చెప్పారు. తాము షెడ్యూల్ ప్రకారం బస్సులను అందజేస్తామని, ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..
- శ్రీశైలంలో అగ్ని ప్రమాదం, భక్తులకు తప్పిన పెను ప్రమాదం
- హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు రమదాన్ అనుభవం..!!
- కువైట్ టవర్స్: జాతీయ గుర్తింపుకు శాశ్వత చిహ్నం..!!
- ఉగ్రవాద సైబర్ దాడిని భగ్నం చేసిన యూఏఈ..!!
- బహ్రెయిన్ను లో మగ్రిబ్ డేట్స్ కు ఫుల్ డిమాండ్..!!
- 'మరూఫ్ ఒమన్' ఇ-కామర్స్ ప్లాట్ఫామ్ బలోపేతం..!!
- అమెరికా రాయబారి వ్యాఖ్యలను ఖండించిన సౌదీ అరేబియా..!!
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి









