కార్మికులు వార్షిక సెలవుల ఫార్వార్డుకు అనుమతి
- July 23, 2022
యూఏఈ: కార్మికుడు లేదా ఉద్యోగి తన వార్షిక సెలవులో సగానికి మించకుండా తదుపరి సంవత్సరానికి ఫార్వార్డ్ లేదా నగదు పరిహారం పొందేందుకు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MOHRE) అనుమతి ఇచ్చింది. కార్మికుల పనిగంటలు, కార్యనిర్వాహక నిబంధనలకు సంబంధించి 2021కి సంబంధించిన ఫెడరల్ డిక్రీ లా No33 ప్రకారం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కార్మికుడి కాంట్రాక్టు రద్దయిన సందర్భంలో ప్రాథమిక వేతనానికి అనుగుణంగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన వార్షిక సెలవుల బ్యాలెన్స్కు సమానమైన నగదు భత్యాన్ని తప్పనిసరిగా చెల్లించాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కార్మికుడు తన వార్షిక సెలవును రెండేళ్లకు మించి తీసుకోకూడదనుకుంటే, లేదా కార్యాలయంలో వర్తించే నిబంధనలకు అనుగుణంగా అతను దాని కోసం నగదు భత్యాన్ని పొందవచ్చని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పార్ట్టైమ్ ఉద్యోగి కూడా వార్షిక సెలవులు పొందడానికి అర్హులని మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







