సకాలంలో జీతాలు చెల్లించని సంస్థలకు జరిమానాలు

- July 28, 2022 , by Maagulf
సకాలంలో జీతాలు చెల్లించని సంస్థలకు జరిమానాలు

యూఏఈ: కార్మికుల జీతాలను సకాలంలో చెల్లించని సంస్థలకు జరిమానాలు విధించేలా యూఏఈ తన వేతన రక్షణ వ్యవస్థ (WPS)కి కొత్త సవరణలు చేసింది. పెనాల్టీలు కార్మికుల జీతాలు చెల్లించడంలో జాప్యం, ఉద్యోగుల సంఖ్యపై ఆధారపడి ఉంటాయని మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రి డాక్టర్ అబ్దుల్‌రహ్మాన్ బిన్ అబ్దుల్మానన్ అల్ అవార్ తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు మంత్రిత్వ శాఖ రిమైండర్‌లు, నోటిఫికేషన్‌లను జారీ చేస్తుందన్నారు. నోటీసులపై తదుపరి చర్యలు తీసుకోకపోతే, అటువంటి సంస్థలకు కొత్త వర్క్ పర్మిట్ల జారీని నిలిపివేసి, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com