అబ్దుల్లా అల్-ముబారక్ను సందర్శించిన నూన్ వర్క్ బ్యాన్ టీమ్
- July 28, 2022
కువైట్: దక్షిణ సబర్బ్ అబ్దుల్లా అల్-ముబారక్ ను నూన్ వర్క్ బ్యాన్ టీమ్ హెడ్, జహ్రా గవర్నరేట్లోని ఆక్యుపేషనల్ సేఫ్టీ డిపార్ట్మెంట్ హెడ్ హమద్ అల్-మఖిల్ సందర్శించారు. ఈ సందర్భంగా హమద్ అల్-మఖిల్ మాట్లాడుతూ.. 10 కంటే ఎక్కువ ప్లాట్లు, 300 కంటే ఎక్కువ కంపెనీలు సందర్శించి నూన్ వర్క్ చట్టం గురించి అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. కార్మికులు, కంపెనీలు చట్టాలకు కట్టుబడి ఉండేలా చూసేందుకు నిబంధనలు ఉల్లంఘించిన సైట్లను 48 గంటల తర్వాత మరోసారి తనిఖీ చేసినట్లు తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించడం కొనసాగించినట్లయితే కంపెనీ ప్రతి కార్మికుడికి 100 నుండి 200 దీనార్ల వరకు జరిమానా చెల్లించవలసి ఉంటుందని, న్యాయ వ్యవహారాల విభాగానికి ఫైల్ పంపిస్తామని, కంపెనీని 'బ్లాక్' జాబితాలో చేర్చే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎండాకాలంలో కార్మికులు ఉదయం 11 నుండి 4 గంటల వరకు పని చేయకుండా నూన్ వర్క్ చట్టం రక్షణ కల్పిస్తోంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







