శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

- July 30, 2022 , by Maagulf
శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుండి హైదరాబాద్ విమానంలో వచ్చిన ప్రయాణికుని వద్ద కిలోకి పైగా అక్రమ బంగారం గుర్తించిన కస్టమ్స్ అధికారులు.నిందితుడు బంగారాన్ని పేస్ట్ గా మార్చి క్యాప్సిల్స్ రూపంలో శరీరం అంతర్భాగంలో దాచుకున్నాడు.

అయితే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో దిగిన అతనిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో అతని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు కస్టమ్స్ అధికారులు.  బంగారం వెలికి తీసిన అధికారులకు 1102 గ్రాముల బంగారం పట్టుబడింది.పట్టుబడ్డ బంగారం విలువ షుమారు 54 లక్షలు ఉంటుందని అంచనా వేశారు.బంగారం స్వాధీనం చేసుకుని నిందితుని విచారణ చేస్తున్నారు.

--శ్రీనివాస్ మంచర్ల(మాగల్ఫ్ ప్రతినిధి,శంషాబాద్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com