కరీంనగర్ లో శ్రీవారి ఆలయం: మంత్రి గంగుల
- August 01, 2022
తిరుమల: తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేదపండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందించగా.టిటిడి ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడి సహకారంతో కరీంనగర్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణరాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తమ ఆస్తిగా భవిస్తారని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మూడో సారి కూడా ప్రజలు కేసీఆర్ కి పట్టం కట్టబోతున్నారని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ వెంట కరీంనగర్ టిఆర్ఎస్ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ గౌడ్ ఉన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!