కరీంనగర్ లో శ్రీవారి ఆలయం: మంత్రి గంగుల
- August 01, 2022
తిరుమల: తెలంగాణ రాష్ట్రంలో మూడవసారి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అవుతారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
తిరుమల శ్రీవారిని తెలంగాణ బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మంటపంలో వేదపండితులు మంత్రి దంపతులకు వేద ఆశీర్వచనం అందించగా.టిటిడి ఆలయ అధికారులు స్వామి వారి పట్టు వస్త్రాలను, తీర్థప్రసాదాలను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ టిటిడి సహకారంతో కరీంనగర్ లో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ 10 ఎకరాల స్థలంలో శ్రీవారి ఆలయం నిర్మించబోతున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విమర్శలు చేసిన తెలంగాణరాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్ ని తమ ఆస్తిగా భవిస్తారని అన్నారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో మూడో సారి కూడా ప్రజలు కేసీఆర్ కి పట్టం కట్టబోతున్నారని మంత్రి స్పష్టం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ వెంట కరీంనగర్ టిఆర్ఎస్ కోఆర్డినేటర్ పొన్నం అనిల్ గౌడ్ ఉన్నారు.
--నారాయణ గుళ్ళపల్లి(మాగల్ఫ్ ప్రతినిధి,కరీంనగర్)
తాజా వార్తలు
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక
- సోషల్ మీడియాలో ‘ఓవర్ షేరింగ్’ చేస్తే డేంజర్ లో పడినట్లే!!
- రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల..
- తెలంగాణ వైద్యారోగ్య శాఖలో సరికొత్త స్కామ్!
- ప్రధాని నరేంద్ర మోదీతో సుందర్ పిచాయ్ భేటీ









