మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- February 19, 2026
మక్కా: మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22 శాతం పెరిగి SR52 బిలియన్లకు చేరుకుంది. 2025 సంవత్సరంలో సందర్శకుల సంఖ్య 21 మిలియన్లు దాటిందని టూరిజం మినిస్ట్రీ గణంకాలను వెల్లడించింది. 2025లో మదీనా మెరుగైన పర్యాటక పనితీరును నమోదు చేసింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పవిత్ర నగరంలో లైసెన్స్ పొందిన హాస్పిటాలిటీ సంస్థల సంఖ్య 35 శాతం పెరిగి 610కి పెరిగింది. లైసెన్స్ పొందిన రూమ్స్ సంఖ్య 24 శాతం పెరిగి 76వేలు దాటిందని పేర్కొంది.
అదే సమయంలో ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీల సంఖ్య కూడా 29 శాతం పెరిగి 240 కి చేరింది. ఇది పర్యాటక రంగ విస్తరణను ప్రతిబింబిస్తుందని సౌదీ అరేబియా పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. "ది స్పిరిట్ ఆఫ్ రమదాన్ " అనే ఫీల్డ్ టూర్లో భాగంగా ఆయన మదీనాలో తనిఖీలు నిర్వహించారు. మదీనాలో ఆతిథ్య సౌకర్యాలు మరియు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..









