మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- February 19, 2026
మక్కా: మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22 శాతం పెరిగి SR52 బిలియన్లకు చేరుకుంది. 2025 సంవత్సరంలో సందర్శకుల సంఖ్య 21 మిలియన్లు దాటిందని టూరిజం మినిస్ట్రీ గణంకాలను వెల్లడించింది. 2025లో మదీనా మెరుగైన పర్యాటక పనితీరును నమోదు చేసింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పవిత్ర నగరంలో లైసెన్స్ పొందిన హాస్పిటాలిటీ సంస్థల సంఖ్య 35 శాతం పెరిగి 610కి పెరిగింది. లైసెన్స్ పొందిన రూమ్స్ సంఖ్య 24 శాతం పెరిగి 76వేలు దాటిందని పేర్కొంది.
అదే సమయంలో ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీల సంఖ్య కూడా 29 శాతం పెరిగి 240 కి చేరింది. ఇది పర్యాటక రంగ విస్తరణను ప్రతిబింబిస్తుందని సౌదీ అరేబియా పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. "ది స్పిరిట్ ఆఫ్ రమదాన్ " అనే ఫీల్డ్ టూర్లో భాగంగా ఆయన మదీనాలో తనిఖీలు నిర్వహించారు. మదీనాలో ఆతిథ్య సౌకర్యాలు మరియు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం
- హైదరాబాద్లో హాట్ కేకుల్లా అమ్ముడైన హౌసింగ్ బోర్డు ప్లాట్లు
- ఏపీ: ఫిబ్రవరి 24న మంత్రివర్గ సమావేశం
- ఏప్రిల్ లో ముంబైలో ఘనంగా తొలి INCA అవార్డులు వేడుక









