మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- February 19, 2026
మక్కా: మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22 శాతం పెరిగి SR52 బిలియన్లకు చేరుకుంది. 2025 సంవత్సరంలో సందర్శకుల సంఖ్య 21 మిలియన్లు దాటిందని టూరిజం మినిస్ట్రీ గణంకాలను వెల్లడించింది. 2025లో మదీనా మెరుగైన పర్యాటక పనితీరును నమోదు చేసింది. పెరుగుతున్న డిమాండ్కు అనుగుణంగా పవిత్ర నగరంలో లైసెన్స్ పొందిన హాస్పిటాలిటీ సంస్థల సంఖ్య 35 శాతం పెరిగి 610కి పెరిగింది. లైసెన్స్ పొందిన రూమ్స్ సంఖ్య 24 శాతం పెరిగి 76వేలు దాటిందని పేర్కొంది.
అదే సమయంలో ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీల సంఖ్య కూడా 29 శాతం పెరిగి 240 కి చేరింది. ఇది పర్యాటక రంగ విస్తరణను ప్రతిబింబిస్తుందని సౌదీ అరేబియా పర్యాటక మంత్రి అహ్మద్ అల్-ఖతీబ్ వెల్లడించారు. "ది స్పిరిట్ ఆఫ్ రమదాన్ " అనే ఫీల్డ్ టూర్లో భాగంగా ఆయన మదీనాలో తనిఖీలు నిర్వహించారు. మదీనాలో ఆతిథ్య సౌకర్యాలు మరియు అందుతున్న సేవలను పరిశీలించారు.
తాజా వార్తలు
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!







