ఇతరుల ఫోటోలు తీయడం నేరం.. సైబర్ క్రైమ్ విభాగం

- August 05, 2022 , by Maagulf
ఇతరుల ఫోటోలు తీయడం నేరం.. సైబర్ క్రైమ్ విభాగం

కువైట్: ఇతరులను ఫొటోలు తీసి.. వారి పరువుకు భంగం కలిగించవద్దని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ప్రజలను కోరింది. ఇతరులను ఇబ్బందులకు గురిచేసిన వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని సైబర్ క్రైమ్ విభాగం హెచ్చరించింది. ఇతరులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టడం.. పరువు తీసే చర్యలకు పాల్పడటం నేరమన్నారు.  ఇతరుల అనుమతి లేకుండా వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం సైబర్ క్రైం కిందకు వస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సైబర్ క్రైమ్ విభాగం ట్వీట్ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com