సీనియర్ నటీ రాజశ్రీ నగలు ఓ దొంగ పట్టపగలు దొంగిలించిన వైనం ..
- April 14, 2016
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన నటించి తెలుగు నటీమణుల్లో మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ నటీమణి రాజశ్రీ. తాజాగా సీనియర్ నటీమణి రాజశ్రీ నగలు, వజ్రాలు పట్టపగలు దొంగిలించి పెద్ద సంచలనమే సృష్టించారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఆమెను మాయచేసి దొంగ బ్యాగ్ ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం రాజశ్రీ (75) చెన్నై లో టీ. నగర్ లో నివసిస్తున్నారు..ఆమె కుమారుడితో కలిసి బ్యాంక్ కు వెళ్లి లాకర్ లో ఉన్న బంగారు ఆభరణాలు, వజ్రాలు తీసుకొని కారులో కూర్చున్నారు.సీనియర్ నటి రాజశ్రీఅయితే ఇదంతా గమనిస్తూ వస్తున్న ఓ దొంగ కారులో కూర్చున రాజశ్రీ పక్కన బైక్ ఆపి కారు పక్కన పది రూపాయల నోటు వేసి అమ్మా ఇది మీ డబ్బు అనుకుంటా అంటూ మర్యాదగా అడగడంతో బహుషా తనవే అనుకొని ఆమె కారుదిగి డబ్బు తీసుకునే ప్రయత్నం చేసేలోపే దొంగ కారులో ఉన్న బ్యాగ్ తీసుకొని ఉడాయించాడు హఠాత్తుగా జరిగిన సంఘటనతో ఆమె షాక్ తినడం జరిగింది..ఆమె తెరుకునే లోపే దొంగ అక్కడ నుంచి పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







