వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- August 09, 2022మస్కట్: ఒమన్ సుల్తానేట్ను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులలో అనధికారిక అంచనాలు, హెచ్చరికలను ప్రచురించవద్దని పౌర విమానయాన అథారిటీ హెచ్చరించింది. తప్పుడు అంచనాలు రూపొందించి పౌర విమానయాన చట్టాన్ని ఉల్లంఘించిన వారికి OMR50,000 వరకు జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ వద్ద ఒమనీ వాతావరణ శాస్త్ర అథారిటీ జారీ చేసిన దానికి విరుద్ధంగా అంచనాలు హెచ్చరికలను ప్రచురించే అనేక మీడియా, వ్యక్తిగత ఖాతాలను పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. ఆర్టికల్ (30) నిబంధనను ఉల్లంఘించే వ్యక్తికి ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, OMR15,000 - OMR50,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..