ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- August 09, 2022
యూఏఈ: భారతదేశం ఫ్లాగ్ క్యారియర్, ఎయిర్ ఇండియా భారతదేశానికి ప్రయాణించే ప్రయాణీకుల కోసం అన్ని GCC స్టేషన్ల నుండి ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ను ప్రారంభించింది. యూఏఈ నుండి ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా ప్రధాన భారతీయ నగరాలకు విమాన టిక్కెట్లను Dh330 కంటే తక్కువకే అందుబాటులోకి తీసుకొచ్చింది. "వన్ ఇండియా వన్ ఫేర్" కింద ఈ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఆగస్ట్ 8 – 21 మధ్య ప్రయాణీకులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా అక్టోబరు 15 వరకు ప్రయాణానికి ప్రమోషన్ వ్యవధిలో విక్రయించే అన్ని టిక్కెట్లపై చెక్ ఇన్ బ్యాగేజీ అలవెన్స్గా 35 కిలోలు, 8 కిలోల హ్యాండ్ లగేజీని ప్రయాణికులకు అనుమతించినట్లు వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో సహా ఎయిర్ ఇండియా గల్ఫ్ కార్యకలాపాలు వారానికి 81,000 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ పిపి సింగ్ తెలిపారు. ఈ పథకం కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని, ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రతిపాదికన అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఛార్జీలు ఎయిర్ ఇండియా వెబ్సైట్/మొబైల్ యాప్లో/అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







