ఎయిర్ ఇండియా స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్.. Dh330కే వన్-వే టిక్కెట్లు
- August 09, 2022
యూఏఈ: భారతదేశం ఫ్లాగ్ క్యారియర్, ఎయిర్ ఇండియా భారతదేశానికి ప్రయాణించే ప్రయాణీకుల కోసం అన్ని GCC స్టేషన్ల నుండి ప్రత్యేక స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ను ప్రారంభించింది. యూఏఈ నుండి ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా ప్రధాన భారతీయ నగరాలకు విమాన టిక్కెట్లను Dh330 కంటే తక్కువకే అందుబాటులోకి తీసుకొచ్చింది. "వన్ ఇండియా వన్ ఫేర్" కింద ఈ సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది. ఆగస్ట్ 8 – 21 మధ్య ప్రయాణీకులకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఇందులో భాగంగా అక్టోబరు 15 వరకు ప్రయాణానికి ప్రమోషన్ వ్యవధిలో విక్రయించే అన్ని టిక్కెట్లపై చెక్ ఇన్ బ్యాగేజీ అలవెన్స్గా 35 కిలోలు, 8 కిలోల హ్యాండ్ లగేజీని ప్రయాణికులకు అనుమతించినట్లు వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్తో సహా ఎయిర్ ఇండియా గల్ఫ్ కార్యకలాపాలు వారానికి 81,000 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఎయిర్ ఇండియా రీజినల్ మేనేజర్ పిపి సింగ్ తెలిపారు. ఈ పథకం కింద పరిమిత సీట్లు అందుబాటులో ఉన్నాయని, ముందుగా వచ్చిన వారికి ముందుగా ప్రతిపాదికన అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ ఛార్జీలు ఎయిర్ ఇండియా వెబ్సైట్/మొబైల్ యాప్లో/అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







