బిజెపితో బంధానికి స్విస్తి పలికిన బీహార్ సీఎం
- August 09, 2022
పాట్నా: బిహార్ సిఎం, జేడీయూ నేత నీతీశ్ కుమార్ బిజెపితో బంధానికి స్విస్తి పలికారు. ఎన్డీయే కూటమితో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈరోజు జేడీయూ పార్టీ నేతల సమావేశంలో నిర్ణయంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బిజెపితో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి నేడు గుడ్బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్లో ముగిసిపోయింది.
బిజెపితో తెగదెంపులు చేసుకున్నట్లు జేడీ నేత నితీశ్ తమ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి నితీశ్ కుమార్.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. నితీశ్ సీఎంగానే కొనసాగనున్నారు.
అయితే కొన్ని ఊహాగానాల ప్రకారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు హోంశాఖ ఇవ్వనున్నారు. నితీశ్కు ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది.
తాజా వార్తలు
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!







