బిజెపితో బంధానికి స్విస్తి పలికిన బీహార్ సీఎం
- August 09, 2022
పాట్నా: బిహార్ సిఎం, జేడీయూ నేత నీతీశ్ కుమార్ బిజెపితో బంధానికి స్విస్తి పలికారు. ఎన్డీయే కూటమితో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈరోజు జేడీయూ పార్టీ నేతల సమావేశంలో నిర్ణయంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బిజెపితో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి నేడు గుడ్బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్లో ముగిసిపోయింది.
బిజెపితో తెగదెంపులు చేసుకున్నట్లు జేడీ నేత నితీశ్ తమ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి నితీశ్ కుమార్.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. నితీశ్ సీఎంగానే కొనసాగనున్నారు.
అయితే కొన్ని ఊహాగానాల ప్రకారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు హోంశాఖ ఇవ్వనున్నారు. నితీశ్కు ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







