మస్కట్ బీచ్లో 70 కిలోల గంజాయి పట్టివేత
- August 11, 2022
మస్కట్: మస్కట్ గవర్నరేట్లోని బీచ్లో 70 కిలోలకుపైగా గంజాయిని రాయల్ ఒమన్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయిని బీచ్ లో అన్ లోడ్ చేసే ప్రయత్నంలో ఉన్న ఇద్దరు చొరబాటుదారులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నార్కోటిక్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కంట్రోల్ జనరల్ డిపార్ట్మెంట్, కోస్ట్ గార్డ్ పోలీసుల సహకారంతో చేపట్టిన దాడుల్లో గంజాయిని అన్లోడ్ చేసే ప్రయత్నంలో ఉన్న నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్లు వివరించారు. వారివద్ద నుంచి 73 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన ప్రక్రియలు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!
- ప్రీ మారిటల్ మెడికల్ సర్టిఫికేట్ రూల్స్ ఉల్లంఘనపై ఒమన్ హెచ్చరిక..!!
- జూన్లో 13 శాతం పెరిగిన కంటైనర్ల రవాణా:ఖతార్
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం







