NBK108 మూవీ ప్రకటన
- August 11, 2022హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ–సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో ఓ సినిమా రాబోతుందని ఎప్పటి నుండో వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా మేకర్స్ ఈ మూవీ ఫై అధికారిక ప్రకటన ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఎవరు నిర్మించబోతున్నారనే అప్డేట్తో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది కూడా ఓ వీడియో రూపంలో క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ను షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. అలాగే ‘అఖండ’ అద్భుతమైన సక్సెస్కు ఓ కారణమైన సంగీత దర్శకుడు ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. షైన్ స్క్రీన్స్ నిర్మాణంలో బాలకృష్ణ, అనిల్ రావిపూడి , ఎస్ థమన్ కాంబినేషన్లో రానున్న ఈ చిత్రం కచ్చితంగా భారీ విజయాన్ని అందుకుంటుందని నిర్మాతలు ప్రకటించారు. ఇక అనౌన్స్మెంట్ వీడియోలో.. ‘‘త్వరలో బాంబార్డింగ్…’’ అని తెలిపారు. ఈ వీడియోకి తమన్ ఇచ్చిన బిజీయం మ్యూజిక్ అదిరిపోయింది. అనౌన్స్మెంట్ బిజీఎంతోనే అదరగొడితే.. సినిమాలో ఏ స్థాయిలో మ్యూజిక్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఇక ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో యాక్షన్ మూవీ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుండగా..థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దసరా బరిలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు