పవన్ సినిమాని రీమేక్ చేస్తానంటోన్న ‘విక్రమ్’ డైరెక్టర్.!

- August 11, 2022 , by Maagulf
పవన్ సినిమాని రీమేక్ చేస్తానంటోన్న ‘విక్రమ్’ డైరెక్టర్.!

‘విక్రమ్’ సినిమాతో ఈ మధ్య లోకేష్ కనగరాజ్ పేరు తెగ మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందే, డైరెక్టర్‌గా ఆయన పనితనం గురించి తెలిసినా, ‘విక్రమ్’ లోకేష్ పనితనాన్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది. 
‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ లోపు ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌ని తాజాగా రివీల్ చేశారు. 
మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియమ్’ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. తెలుగులో ఈ సినిమాని పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్‌ని సైతం ఈ సినిమా షేక్ చేసింది. 
ఇప్పుడు కోలీవుడ్‌కి కాసుల పంట పండించేలా లోకేష్ కనగరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ కాంబోని సెట్ చేశాడు ఈ రీమేక్ కోసం. ఇంతకీ ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా.? సూర్య, కార్తి. ఆఫ్ స్ర్కీన్ అన్నదమ్ములైన ఈ ఇద్దరినీ, ఆన్ స్ర్కీన్ ఎనిమీస్‌గా మార్చేయబోతున్నాడట లోకేష్ కనగరాజ్. 
ఇప్పుడీ అనౌన్స్‌మెంట్ తమిళ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు లోకేష్ ఖాతాలో విజయ్‌తో ఓ సినిమా, కార్తితో ‘ఖైదీ 2’ సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. మరి, వీటి తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా.? లేదంటే, అంతకు ముందే ఈ రీమేక్ సినిమాని కానిచ్చేస్తాడా.? అనేది తెలియాల్సి వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com