పవన్ సినిమాని రీమేక్ చేస్తానంటోన్న ‘విక్రమ్’ డైరెక్టర్.!
- August 11, 2022‘విక్రమ్’ సినిమాతో ఈ మధ్య లోకేష్ కనగరాజ్ పేరు తెగ మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందే, డైరెక్టర్గా ఆయన పనితనం గురించి తెలిసినా, ‘విక్రమ్’ లోకేష్ పనితనాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లింది.
‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ లోపు ఆయన మరో కొత్త ప్రాజెక్ట్ని తాజాగా రివీల్ చేశారు.
మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియమ్’ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. తెలుగులో ఈ సినిమాని పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్ని సైతం ఈ సినిమా షేక్ చేసింది.
ఇప్పుడు కోలీవుడ్కి కాసుల పంట పండించేలా లోకేష్ కనగరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ కాంబోని సెట్ చేశాడు ఈ రీమేక్ కోసం. ఇంతకీ ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా.? సూర్య, కార్తి. ఆఫ్ స్ర్కీన్ అన్నదమ్ములైన ఈ ఇద్దరినీ, ఆన్ స్ర్కీన్ ఎనిమీస్గా మార్చేయబోతున్నాడట లోకేష్ కనగరాజ్.
ఇప్పుడీ అనౌన్స్మెంట్ తమిళ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు లోకేష్ ఖాతాలో విజయ్తో ఓ సినిమా, కార్తితో ‘ఖైదీ 2’ సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. మరి, వీటి తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా.? లేదంటే, అంతకు ముందే ఈ రీమేక్ సినిమాని కానిచ్చేస్తాడా.? అనేది తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు