పవన్ సినిమాని రీమేక్ చేస్తానంటోన్న ‘విక్రమ్’ డైరెక్టర్.!
- August 11, 2022
‘విక్రమ్’ సినిమాతో ఈ మధ్య లోకేష్ కనగరాజ్ పేరు తెగ మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందే, డైరెక్టర్గా ఆయన పనితనం గురించి తెలిసినా, ‘విక్రమ్’ లోకేష్ పనితనాన్ని నెక్స్ట్ లెవల్కి తీసుకెళ్లింది.
‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ లోపు ఆయన మరో కొత్త ప్రాజెక్ట్ని తాజాగా రివీల్ చేశారు.
మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియమ్’ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. తెలుగులో ఈ సినిమాని పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్ని సైతం ఈ సినిమా షేక్ చేసింది.
ఇప్పుడు కోలీవుడ్కి కాసుల పంట పండించేలా లోకేష్ కనగరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ కాంబోని సెట్ చేశాడు ఈ రీమేక్ కోసం. ఇంతకీ ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా.? సూర్య, కార్తి. ఆఫ్ స్ర్కీన్ అన్నదమ్ములైన ఈ ఇద్దరినీ, ఆన్ స్ర్కీన్ ఎనిమీస్గా మార్చేయబోతున్నాడట లోకేష్ కనగరాజ్.
ఇప్పుడీ అనౌన్స్మెంట్ తమిళ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు లోకేష్ ఖాతాలో విజయ్తో ఓ సినిమా, కార్తితో ‘ఖైదీ 2’ సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. మరి, వీటి తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా.? లేదంటే, అంతకు ముందే ఈ రీమేక్ సినిమాని కానిచ్చేస్తాడా.? అనేది తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







