సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

- August 12, 2022 , by Maagulf
సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

కువైట్: దేశంలోని ఒక ఆసుపత్రిలోని ఒక మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో ఒకే ఒక్క మహిళా రిసెప్షనిస్ట్ పనిచేస్తున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాల వివిధ విభాగాలలో తగినంత సంఖ్యలో రిసెప్షనిస్ట్‌లు, నిర్వాహకులు ఉన్నారని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దేశంలోని ఆరోగ్య సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా, వక్రీకరించే విధంగా తప్పుడు వార్తలు, ఆరోపణలకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com