టూరిస్ట్ వీసా హోల్డర్లు ఉమ్రా చేయవచ్చు
- August 12, 2022
జెడ్డా: పర్యాటక వీసాలు కలిగి ఉన్న సందర్శకులను ఉమ్రా చేయడానికి అనుమతిస్తున్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 49 దేశాల పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. వీలైనంత ఎక్కువ మంది ఉమ్రా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉమ్రాకు అనుమతించిన 49 దేశాల జాబితాల్లో అమెరికా, ఇంగ్లండ్, స్కెంజెన్ దేశాలు కూడా ఉన్నాయి. కాగా, ఫ్యామిలీ విజిట్ వీసాలు ఉన్న వారు ఈట్మార్నా యాప్ ద్వారా బుకింగ్ చేయడం ద్వారా ఉమ్రా చేయవచ్చని సూచించింది. అయితే, ఉమ్రా చేయడానికి సందర్శకులు సమగ్ర ఆరోగ్య బీమాను పొందవలసి ఉంటుందని తెలిపింది. ఈ బీమాలో COVID-19 చికిత్సకు అయ్యే ఖర్చులు, మరణాలు లేదా వైకల్యానికి దారితీసే ప్రమాదాలతోపాటు విమానాల ఆలస్యం లేదా రద్దు కారణంగా ఉత్పన్నమయ్యే ఖర్చులు ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







