టూరిస్ట్ వీసా హోల్డర్లు ఉమ్రా చేయవచ్చు
- August 12, 2022
జెడ్డా: పర్యాటక వీసాలు కలిగి ఉన్న సందర్శకులను ఉమ్రా చేయడానికి అనుమతిస్తున్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 49 దేశాల పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. వీలైనంత ఎక్కువ మంది ఉమ్రా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉమ్రాకు అనుమతించిన 49 దేశాల జాబితాల్లో అమెరికా, ఇంగ్లండ్, స్కెంజెన్ దేశాలు కూడా ఉన్నాయి. కాగా, ఫ్యామిలీ విజిట్ వీసాలు ఉన్న వారు ఈట్మార్నా యాప్ ద్వారా బుకింగ్ చేయడం ద్వారా ఉమ్రా చేయవచ్చని సూచించింది. అయితే, ఉమ్రా చేయడానికి సందర్శకులు సమగ్ర ఆరోగ్య బీమాను పొందవలసి ఉంటుందని తెలిపింది. ఈ బీమాలో COVID-19 చికిత్సకు అయ్యే ఖర్చులు, మరణాలు లేదా వైకల్యానికి దారితీసే ప్రమాదాలతోపాటు విమానాల ఆలస్యం లేదా రద్దు కారణంగా ఉత్పన్నమయ్యే ఖర్చులు ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







