ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
- August 14, 2022
అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది. నేడు ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలుల ప్రభావం ఉంది.
ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు మరియు రేపు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచును.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఇక ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో అన్ని ప్రాజెక్ట్ లు నిండుకుండలా మారిపోయాయి.
తాజా వార్తలు
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!







