ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు
- August 14, 2022
అమరావతి: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం 8.30 గంటలకు ఏర్పడిన ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదలుతోంది. నేడు ఇది వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. అలాగే, ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో పడమర గాలుల ప్రభావం ఉంది.
ఫలితంగా కోస్తా, రాయలసీమల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ రోజు మరియు రేపు ఈదురు గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్లు వేగముతో ఒకటి లేదా రెండు చోట్ల వీయవచును.ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది.
ఇక ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లో అధిక వర్షపాతం నమోదైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జులై నెలలో భారీ వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో అన్ని ప్రాజెక్ట్ లు నిండుకుండలా మారిపోయాయి.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







